ఇక ఉత్తర ప్రదేశ్ పై ఆప్ దృష్టి.. ఇప్పటికే పని మొదలుపెట్టాం: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
- ఢిల్లీ డెవలప్ మెంట్ మోడల్ తో పోలిస్తే గుజరాత్ మోడల్ ఉత్తదే..
- యూపీలో గూండా రాజ్ కు చెక్ పెడతామని వ్యాఖ్య
- 2022 ఎలక్షన్లలో తమ ప్రభావం చూపుతామని వెల్లడి
ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో ఘన విజయంతో ఊపు మీద ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పై దృష్టి పెట్టింది. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పాగా వేయడంపై దృష్టి సారించామని ఆప్ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. ఉత్తర ప్రదేశ్ కు ఢిల్లీ అభివృద్ది మోడల్ చూపించి ఓట్లు అడుగుతామని తెలిపారు.